Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (18:12 IST)
చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలిలో చోటుచేసుకుంది. బరేలీ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ సింగ్ కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పారి, పిహు, విధి కాగా ఈ ముగ్గురు చిన్నారులు చాలా చురుగ్గా ఉండేవారు. 
 
అయితే గత శుక్రవారం ముగ్గురు స్థానికంగా ఉన్న ఓ షాపులో బిస్కెట్స్, చిప్స్ కొనుక్కుని వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వాటిని తిన్నారు. అవి తిన్న తర్వాత 24 గంటల్లోపే ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
కడుపు నొప్పి వాంతులతో బాధ పడ్డారు. దాంతో తండ్రి నవీన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం తీసుకెళ్తుండగా ఇద్దరు అక్కా చెల్లెలు పీహు, పారి మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఇక విధి చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు తెలుస్తోంది.
 
ఆదివారం నాడు చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చిన్నారులు తిన్న చిప్స్ బిస్కెట్లను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments