టీకా వేస్తానంటే పాముతో కాటేయిస్తా.. సిబ్బందికి మహిళ బెదిరింపు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (18:36 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఓ కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పాములను పట్టి ఆడించే కమలా దేవి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లగా టీకా తీసుకునేందుకు ఆమె నిరాకరించింది. 
 
ఆమెకు ఎంతగానో నచ్చజెప్పేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించారు. అప్పటికీ వినలేదు. మొండిగా ప్రవర్తించి టీకా వేసేందుకు ప్రయత్నించారు. అంతే.. బుట్టలో నుంచి ఒక పామును తీసిన ఆ మహిళ.. తన ఇంటి నుంచి వెళ్లకపోతే పామును వారిపైకి విసురుతానని హెచ్చరించింది.
 
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కమలా దేవి ఇంటికి వచ్చారు. దీంతో వైద్య సిబ్బంది స్థానికుల సహాయం కోరారు. వారంతా ఆమెకు నచ్చజెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీంతో దిగి వచ్చిన కమలా దేవి చివరకు టీకా వేయించుకుంది. ఆమె తర్వాత స్థానికంగా ఉన్న 20 మంది కూడా వ్యాక్సిన్‌ పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments