Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మరో దిశ ఘటన : రేప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు...

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (11:18 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచార, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనను మరచిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహా మరో ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం జరిపి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధిత యువతి 90 శాతం మేరకు కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని ఉన్నావోలో ఓ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
నిజానికి ఈ అత్యాచారం చాలా రోజుల క్రితమే జరిగింది. అయితే, కామాంధులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. దీంతో ఆమెపై హత్యాయత్నం చేశారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments