Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూడ్చిపెట్టిన శవం తల నరికి ఎత్తుకెళ్లారు.. ఎవరు?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (17:36 IST)
భారతదేశం ఓ వైపు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంటే, ఇంకా చేతబడులు చేయడం వంటి మూఢనమ్మకాలతో తిరోగమిస్తోంది. అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. శ్మశానంలో పాతిపెట్టిన శవాన్ని దుండుగులు బయటకు తీసి, తల తీసుకుపోయిన సంఘటన కర్ణాటకలోని నెలమంగల తాలూకా భైరనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
భైరనహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న అరసయ్య (65) వయోభారంతో జనవరి 13న మృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామ శివారులో పాతిపెట్టారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శవాన్ని బయటకు తీసి తల నరికి ఎత్తుకెళ్లిపోయారు.
 
బుధవారం ఉదయాన్నే శ్మశానం వైపు వెళ్లిన స్థానికులు తన లేని శవాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే నెలమంగల రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబసభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చిపెట్టారు. బుధవారం నాడు అమావాస్య కావడంతో చేతబడి చేయడం కోసం మాంత్రికులు ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments