Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యకర్త హత్య... పాడె మోసిన స్మృతి ఇరానీ (Video)

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:58 IST)
కాంగ్రెస్ కంచుకోట అమెథిలో రాహుల్ గాంధీపై 55,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది స్మృతి ఇరానీ పెద్ద సంచలనమే సృష్టించారు. తాజాగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సాధారణ గ్రామస్థాయి కార్యకర్త చనిపోతే పాడె మోసి తన రుణం తీర్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో బరూలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ బీజేపీ గ్రామస్థాయి నాయకుడు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీకి గెలుపు కోసం సురేంద్ర సింగ్ చాలా కష్టపడ్డాడు. అయితే కొందరు దుండగులు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి కాల్చి చంపారు. అమేథీలో రాహుల్ పైన స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ వెంటనే బరులియా గ్రామానికి వచ్చి అతడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. అంతటితో ఆగకుండా సురేంద్ర సింగ్ పాడెను మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments