Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వదిన గారి అప్పడం' తింటే కరోనా మాయం : సెలవిచ్చిన కేంద్ర మంత్రి

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:50 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. కానీ, కొందరు రాజకీయ నేతలు మాత్రం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అలాగే, వైరస్ సోకినప్పటికీ.. ఐసోలేషన్‌లో ఉండకుండా, స్వేచ్ఛగా ప్రజల మధ్య తిరుగుతున్నారు.
 
అంతేకాకుండా, కరోనా విషయంలో ఎవరూ ఎలాంటి తప్పుడు సమాచారం వ్యాపింపచేయరాదని ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పదే పదే మొత్తుకుంటున్నాయి. అయినప్పటికీ కొందరు మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 
 
తాజాగా, కేంద్ర మంత్రి ఒకరు... అప్పడం తింటే కరోనాను జయించవచ్చని సెలవిచ్చారు. ఆయన పేరు అర్జున్ రామ్ మేఘ్వాల్. కేంద్ర జలవనరులు, నదీ అభివృద్ధి, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి.
 
అది కూడా మామూలు అప్పడం కాదట.. 'భాభీజీ పాపడ్' (వదిన గారి అప్పడం) అనే బ్రాండెడ్ అప్పడం అయితేనే కరోనాతో సమర్థంగా పోరాడుతుందని సెలవిచ్చారు. ఈ అప్పడం తింటే ఒంట్లో కావాల్సినన్ని యాంటీబాడీలు తయారవుతాయని, దాంతో కరోనాపై కత్తిదూయవచ్చని వివరించారు. 
 
ఈ 'భాభీజీ అప్పడం' గురించి ప్రత్యేకంగా చెబుతూ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వదిలారు. అయితే దీనిపై విమర్శలు మామూలుగా రాలేదు. రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఆడుకున్నారు. సోషల్ మీడియాలో దీనిపై జోకులు, మీమ్స్ భారీ స్థాయిలో దర్శనమిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments