Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (10:39 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వాహనాన్ని ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టగా.. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి జమ్మూకాశ్మీర్‌ పర్యటనలో రామ్‌బన్‌ జిల్లా బనిహాల్‌ వద్ద జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఉదంపూర్‌ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు బ్రేక్‌డౌనుకు గురైనట్లు అదనపు డీజీ ముకేశ్‌సింగ్‌ తెలిపారు. 
 
ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో స్పందించి కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూకాశ్మీర్‌ వెళ్లిన కిరణ్‌ రిజిజు ఉదంపూర్‌ వరకు కారులో ప్రయాణించారు. 'ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు' అంటూ విశాలమైన రోడ్డును చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో మంత్రి పోస్టు చేశారు. అంతలోనే ఇలా జరగడం యాదృచ్ఛికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments