Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (10:39 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వాహనాన్ని ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టగా.. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి జమ్మూకాశ్మీర్‌ పర్యటనలో రామ్‌బన్‌ జిల్లా బనిహాల్‌ వద్ద జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఉదంపూర్‌ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు బ్రేక్‌డౌనుకు గురైనట్లు అదనపు డీజీ ముకేశ్‌సింగ్‌ తెలిపారు. 
 
ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో స్పందించి కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూకాశ్మీర్‌ వెళ్లిన కిరణ్‌ రిజిజు ఉదంపూర్‌ వరకు కారులో ప్రయాణించారు. 'ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు' అంటూ విశాలమైన రోడ్డును చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో మంత్రి పోస్టు చేశారు. అంతలోనే ఇలా జరగడం యాదృచ్ఛికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments