Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - రాజమౌళిలతో భేటీకానున్న హోం మంత్రి అమిత్ షా

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (17:34 IST)
స్టార్ హీరో ప్రభాస్, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీకానున్నారనే వార్తలు వస్తున్నాయి. అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కావాలని భావిస్తున్నారు. మహాజన్ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుని, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. 
 
ఆ సమయంలో దర్శకుడు రాజమౌళి, సినీనటుడు ప్రభాస్‌లతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్‌షా కలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిథాలీ రాజ్ తదితరులను కలిశారు. 
 
అలాగే, ఇప్పుడు ప్రభాస్, రాజమౌళిలను కలవనున్నట్లు సమాచారం. జూన్‌ 16న 'ఆది పురుష్‌' విడుదలకానున్న నేపథ్యంలో ప్రభాస్‌ను అమిత్‌షా భేటా కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ భేటీపై అటు ప్రభాస్‌-రాజమౌళి, ఇటు భాజపా వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments