Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ పొడగింపు... డబ్ల్యూహెచ్ఓ ప్రకటన మోసపూరితం : పీఐబీ

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:37 IST)
దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ పొడగింపు సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన సర్క్యులేట్ అవుతోంది. ముఖ్యంగా, ఈ లాక్‌డౌన్ ఐదు దశల్లో కేంద్రం అమలు చేయబోతుందంటూ ఓ ప్రచారం సాగుతోంది. దీన్ని భారత ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ కొట్టిపారేసింది. లాక్‌డౌన్ పొడగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్న ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా విభాగం ప్రకటన మేరకు భారత్‌లో ఐదు అంచెల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందంటూ ఈ వదంతులు సృష్టిస్తున్నారు. ఈ వదంతులన్నీ బూటకమని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments