కంగేయం స్థానానికి 1000 మంది రైతుల నామినేషన్ల దాఖలు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:59 IST)
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 1000 మంది రైతులు కంగేయం స్థానానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పరంబికుళం-అల్లియర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ను నాయకులు పట్టించుకోకపోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే విషయంపై ఐదు రోజులు నిరాహార దీక్షలు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఇచ్చిన హామీతో రైతులు నిరాహార దీక్షను ముగించారు. 
 
సీఎం హామీ.. హామీగానే మిగిలిపోయిందని తమ డిమాండ్లు నెరవేరలేదని రైతులు అంటున్నారు. అందుకే ఎన్నికల వేళ రైతు కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. కమిటీ సభ్యులు మంగళవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 20కి పైగా నామినేషన్లు వేసినట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.
 
ఈరోడ్ జిల్లాలోని మోడకురుచి అసెంబ్లీ సీటుపై రైతులు 25 సంవత్సరాల క్రితం ఇదే పనిచేశారు. 1996లో, 1,016 మంది రైతులు నామినేషన్ వేశారు, మొత్తం 1.033 మంది అభ్యర్థులు అప్పట్లో పోటీలో ఉన్నారు. ఇది ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. చివరికి అక్కడ ఎన్నికలు ఒక నెల వాయిదా పడాల్సి వచ్చింది. 50 పేజీల బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్‌లో కూడా పసుపు రైతులు 158మంది పార్లమెంట్‌కు పోటీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments