Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు విద్యార్థుల దుర్మరణం

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (14:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగ్దా - ఉన్హేల్‌ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ఒక స్కూలు వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలోనున్న ఒక కాన్వెంట్​ వ్యాన్​ పిల్లలతో సహా స్కూల్​కు బయలుదేరింది. మార్గ మధ్యలో రాంగ్ రూట్‌లో వస్తున్న ఒక లారీ​ వేగంగా వచ్చిన స్కూలు వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూలు వ్యాను నుజ్జు నుజ్జు అయిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను ఉజ్జయిన వైపు వెళ్తున్న బస్సులో చికిత్స కోసం తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments