Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరం ప్రజల ప్రయోజనాలకు ఉమ్మడి పౌర స్మృతి విరుద్ధం : సీఎం జోరామ్ తంగ

Webdunia
బుధవారం, 5 జులై 2023 (09:40 IST)
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్ తంగ కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీ తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమంటూ వ్యాఖ్యానించారు. ఇదివరకే మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ యూసీసీని వ్యతిరేకించారు. ఇపుడు మిజోరా ముఖ్యమంత్రి ఆ జాబితాలో చేరారు. వీరిద్దరూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కావడం గమనార్హం. ఎన్డీయే విధానాలు ప్రజలకు, మైనార్టీలకు ప్రయోజనం ఉన్నంత వరకే మద్దతిస్తామని మిజోరం సీఎం తెగేసి చెప్పేశారు. 
 
యూసీసీ అల్పసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకమని, ముఖ్యంగా మిజోరాల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు మంగళవారం భారత న్యాయ కమిషన్‌కుక ఆయన ఓ లేఖ రాశారు. యూసీసీ మిజోరాల మతపరమైన, సామాజిక అంశాలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (జీ)ద్వారా రక్షించబడిన మిజోరం వాసుల ఆచారాలకు విరుద్ధంగా ఉందని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. 
 
మరో మిత్రపక్ష పార్టీ నేత, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా యూసీసీ విభేదించారు. యూసీసీ భారత ప్రస్తుత ఆలోచనలకు విరుద్ధమని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. సంగ్మా మాట్లాడిన కొన్ని రోజులకే జోరామ్ తంగ కూడా అదేవిధంగా మాట్లాడటం గమనార్హం. ఎన్డీయే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలకు, దేశంలోని మైనార్టీలకు ప్రయోజనకరంగా ఉన్నంత వరకు మాత్రమే తాము మద్దతు ఇస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments