Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర హింసపై ట్వీట్లు : ఇద్దరు మహిళా జర్నలిస్టుల గృహనిర్బంధం

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (07:46 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ఇటీవల చెలరేగిన హింసపై వరుస ట్వీట్లు ఇచ్చినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ఇద్దరిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచారు. 
 
ఓ మీడియా ఛానల్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులు కవరేజీ కోసం వరుసగా ట్వీట్లు ఇచ్చారు. దీంతో అస్సోం పోలీసులు వీరిద్దరిని నిర్బంధించారు. తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌.. వారిపై రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. 
 
నోటీసులు అందజేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులు తమను అనధికారికంగా నిర్బంధించారని సమృద్ధీ సకూనియా, స్వర్ణ ఝా జర్నలిస్టులు ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను వీరిద్దరూ సందర్శించారని, లేనిపోని విషయాలతో వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ట్వీట్లు చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తమముందు హాజరై విచారణ ఇవ్వాలని కోరినా స్పందించకుండా రాష్ట్రం వదిలి వెళ్లారని పోలీసులు చెప్పారు.
 
కాగా, జర్నలిస్టుల అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. త్రిపురలో హింసపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులు సహా 71 మందిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments