Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి - 68 మంది జ‌వాన్ల‌కు క‌రోనా

Webdunia
శనివారం, 2 మే 2020 (11:41 IST)
పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు.

శుక్రవారం బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్‌ సెక్టార్‌ వద్ద పాకిస్థాన్‌ కాల్పులకు పాల్పడగా ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో ఇద్దరు సైనికులు శనివారం ఉదయం మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే, క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. ఈస్ట్ ఢిల్లీలోని ఓ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియ‌న్‌కు చెందిన‌ జ‌వాన్లు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా మ‌రో 68 మంది జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డ్డ సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య 127కు చేరింది. వారిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా 125 మందిలో 122 మంది ఈస్ట్ ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు చెందిన జ‌వాన్లే కావ‌డం గ‌మ‌నార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments