Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బాంబు పేలుళ్లు

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (11:31 IST)
Jammu Air Force Station
జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం అర్ధరాత్రి 1:45 గంటలకు పేలుళ్లు సంభవించాయని పీటీఐ పేర్కొంది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ అధికారులు సైతం అర్ధరాత్రి రాత్రి దాటిన తరువాత సంభవించిన బాంబు పేలుళ్లపై ట్వీట్ చేశారు.
 
ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని టెక్నికల్ ఏరియాలో భవనం పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి బాంబు టెక్నికల్ విభాగంలో సంభవించగా, రెండో బాంబు పేలుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి పరికరాలు, వస్తువులు దెబ్బతినలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. 
 
బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్, ఇతర టెక్నికల్ టీమ్ విభాగాలకు చెందిన అధికారులు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments