TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఐవీఆర్
గురువారం, 21 ఆగస్టు 2025 (20:10 IST)
మధురైలో జరిగిన మానాడు సమావేశానికి వెళ్లిన ఒక వాలంటీర్ మృత్యువాత పడ్డాడు. చెన్నై నుండి సమావేశానికి వెళ్లిన ప్రభాకరన్ అనే వాలంటీర్ సక్కిమంగళంలో మూత్ర విసర్జనకు వెళ్తూ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆయనను మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు, కానీ చికిత్సకు ఆయన స్పందించలేదు. అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
 
గురువారం నాడు జరిగిన విజయ్ మానాడు సమావేశానికి సుమారు 4 లక్షల మంది దాకా ప్రజలు పాల్గొన్నట్లు చెప్పుకుంటున్నారు. ఉదయం 10 గంటలకే సమావేశ పెవిలియన్‌లోని అన్ని సీట్లు నిండిపోయాయి. తీవ్రమైన ఎండ వేడి కారణంగా 10 మంది వాలంటీర్లు స్పృహ కోల్పోయారు. వారిలో ఒకరిని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో, 9 మందిని వాయంకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.
 
ఐతే గుండెపోటుతో ఒక వాలంటీర్ మరణించడం స్వచ్ఛంద సేవకులలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments