Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట తొలిసారి రైల్వే టీసీగా హిజ్రా!!

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (08:59 IST)
తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి ఓ హిజ్రా రైల్వేలో టిక్కెట్ ఇన్‌స్పెక్టరుగా నియమితులయ్యారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈ హిజ్రా పేరు సింధు. రాష్ట్రంలోనే తొలిసారి రైల్వే టీసీగా నియమితులయ్యారు. తమిళ సాహిత్యంలో బిఏ పూర్తి చేసిన (బీఏ లిటరేచర్) సింధు.. 19 ఏళ్ల క్రితం రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పనిచేశారు. అనంతరం బదిలీపై దిండుక్కల్‌కు వచ్చారు. ఓ ప్రమాదంలో ఆమె చెయ్యికి తీవ్రగాయమైంది. దీంతో వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఆమె టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తిచేశారు. 
 
ఈ నేపథ్యంలో సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమెకు రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ గోవిందరాజ్‌, సెక్రటరీ రబీక్‌ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments