Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట తొలిసారి రైల్వే టీసీగా హిజ్రా!!

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (08:59 IST)
తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి ఓ హిజ్రా రైల్వేలో టిక్కెట్ ఇన్‌స్పెక్టరుగా నియమితులయ్యారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈ హిజ్రా పేరు సింధు. రాష్ట్రంలోనే తొలిసారి రైల్వే టీసీగా నియమితులయ్యారు. తమిళ సాహిత్యంలో బిఏ పూర్తి చేసిన (బీఏ లిటరేచర్) సింధు.. 19 ఏళ్ల క్రితం రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పనిచేశారు. అనంతరం బదిలీపై దిండుక్కల్‌కు వచ్చారు. ఓ ప్రమాదంలో ఆమె చెయ్యికి తీవ్రగాయమైంది. దీంతో వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఆమె టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తిచేశారు. 
 
ఈ నేపథ్యంలో సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమెకు రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ గోవిందరాజ్‌, సెక్రటరీ రబీక్‌ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments