Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు... మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. ఓ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన రజిగింది. అయితే అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఒక్కరు మాత్రం గాయపడ్డారు. 
 
మధుర రైల్వే స్టేషన్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ కథనం మేరకు.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకై, ప్రాణభయంతో పరుగులు తీశారు. అంత ఎత్తున్న ఫ్లాట్‌ఫ్లాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments