Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు... మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. ఓ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన రజిగింది. అయితే అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఒక్కరు మాత్రం గాయపడ్డారు. 
 
మధుర రైల్వే స్టేషన్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ కథనం మేరకు.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకై, ప్రాణభయంతో పరుగులు తీశారు. అంత ఎత్తున్న ఫ్లాట్‌ఫ్లాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments