Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం ముందు లొంగిపోయిన కీలక ఉగ్రవాదులు..

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:04 IST)
భారత సైన్యం ముందు కీలక ఉగ్రవాదులు లొంగిపోయారు. భారత సైన్యానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అమలు చేసిన వేగవంతమైన మరియు ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌లో హార్డ్కోర్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (స్వతంత్ర) నాయకుడు దృష్టి రాజ్ఖోవా లొంగిపోయారు. మేఘాలయ-అస్సాం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదాలు లొంగిపోయినట్లు సైనిక అధికారిక వర్గాలు తెలిపాయి.
 
వేదాంత, యాసిన్ అసోమ్, రోప్జ్యోతి అసోమ్ మరియు మిథున్ అసోమ్ అనే నలుగురు సహచరులతో కలిసి ఆయన లొంగిపోయారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత తొమ్మిది నెలలుగా భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
దిగువ అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమైన ఉల్ఫా ఉగ్రవాదుల కోసం చాలా కాలంగా గాలిస్తున్నారు. మిలిటెంట్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండ్ అయిన రాజ్‌ఖోవా ప్రస్తుతం ఆర్మీ ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నారని, వారిని అస్సాంకు తీసుకువస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments