Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తు.. దివ్యాంగుడైన కుమారుడికి నిప్పంటించిన తండ్రి

కుమారుడినే ఓ తండ్రి సజీవ దహనం చేశాడు. దివ్యాంగుడైన కుమారుడు పడే కష్టాలు చూడలేక తండ్రే ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి సమీప నాసరెద్

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (09:55 IST)
కుమారుడినే ఓ తండ్రి సజీవ దహనం చేశాడు. దివ్యాంగుడైన కుమారుడు పడే కష్టాలు చూడలేక తండ్రే ఈ పని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి సమీప నాసరెద్‌కు చెందిన ముత్తుకుమార్‌కు భార్య శివగని, దివ్యాంగుడైన కుమారుడు హరిప్రసాద్‌ (14) ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న అతను మంచంపై పడుకున్న హరిప్రసాద్‌కు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయినట్లు నాసరెద్‌ పోలీసులు తెలిపారు.
 
ఆపై ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముత్తుకుమార్‌ను అరెస్ట్ చేశారు. హరిప్రసాద్ చిన్న వయస్సు నుంచే ఎదుగుదల లేకుండా ఉన్నాడని, మాటలు రాలేదని, చెవులు వినిపించవని చెప్పాడన్నారు. కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయ్యాడని, అందువల్ల అతను అవస్థలను చూడలేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
తనకు, తన భార్య అన్న సామువేల్‌ పట్రోజ్‌కు మధ్య గొడవలు ఉన్నాయని, అతనిపై కక్షతో హరిప్రసాద్‌ను చంపి ఆ నేరం సామువేల్‌ పట్రోజ్‌పై వేయాలనుకున్నానని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments