ఇపుడు కందిపప్పు వంతు.. పెరుగుతూ పోతున్న ధర

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:25 IST)
నిన్నామొన్నటి వరకు వంట నూనెలలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి పెరిగిపోయి తిరిగి కిందకు దిగుతున్నాయి. ఇపుడు కందిపప్పు వంతు వచ్చింది. ఏపీలో గత ఎనిమిది నెలల్లో కందిపప్పు ధర 55 శాతం ధర పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో రూ.160-170 మధ్య పలుకుతుండగా, బ్రాండెడ్ కందిపప్పును రూ.180కిపైనే విక్రయిస్తున్నారు. మున్ముందు ఈ ధర రూ.200 దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు తగ్గిపోవడమే. 
 
ఈ యేడాది జనవరిలో కిలో కందిపప్పు ధర రూ.98 నుంచి రూ.110 వరకు ఉంది. ఆగస్టులో రూ.170కి చేరుకుంది. అంటే గత 8 నెలల్లో 55 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో గరిష్ఠంగా 8.50 లక్షల ఎకరాల్లో కందిపప్పు సాగుచేసేవారు. గతేడాది ఇది 6 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ పంట ద్వారా 1.09 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయాయి.
 
మరోవైపు, ఈ ఏడాది కందిసాగు దారుణంగా పడిపోయింది. ఆగస్టు నెలాఖరు నాటికి 292 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. దేశవ్యాప్తంగానూ కంది సాగు గణనీయంగా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. 2018లో దేశంలో 43 లక్షల కందిపప్పు ఉత్పత్తి కాగా, ఈ ఏది ఇప్పటి వరకు 34 లక్షల టన్నులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కందిపప్పును దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments