Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులు ఇవ్వలేం : ఢిల్లీ హైకోర్టు

court
, సోమవారం, 28 ఆగస్టు 2023 (11:45 IST)
న్యాయ నిర్ణయం ప్రక్రియలో మానవ జోక్యానికి, కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఇలాంటి చాట్‌బోట్‌ల ఖచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నందున ప్రాథమిక పరిశోధన/అవగాహన కోసం మాత్రం ఉపయోగించుకోవచ్చని సూచించింది.
 
వ్యాపార చిహ్న నిబంధనలను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. విలాసవంతమైన చెప్పులు, బూట్లు తయారుచేసే 'క్రిస్చన్‌ లూబటన్‌' దాఖలు చేసిన ఓ కేసులో ఇటీవల జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌ తీర్పు వెలువరించారు. తమ నమోదిత వ్యాపార చిహ్నంపై, దాని ప్రతిష్ఠపై చాట్‌జీపీటీ ఏం చెబుతోందో చూడాలని సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. 
 
ప్రశ్న ఏ తీరులో ఉందనే దానిని బట్టి, దానికి అందిన శిక్షణ ఆధారంగా చాట్‌బోట్‌లు సమాధానాలు ఇస్తుంటాయని, అవి తప్పు అయ్యే అవకాశాలూ లేకపోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషనర్‌ ఉత్పత్తులను కాపీ కొట్టారని, ఆ బ్రాండ్‌ పేరును వాడుకొని డబ్బు సంపాదించాలనే ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది. 
 
పిటిషనర్‌ బూట్ల డిజైన్లను, రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ చేయరాదని ప్రతివాదిని ఆదేశించింది. ఈ మేరకు పిటిషనర్‌తో ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. దానిని అతిక్రమిస్తే రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుత పిటిషన్‌ ఖర్చుల కింద ఫిర్యాదిదారుకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.36వేలు.. లెనోవో టాబ్ పీ12 భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది..