Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొప్ప మనసు చాటుకున్న తమిళ జంట.. రూ.37లక్షల భారీ విరాళం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (22:30 IST)
Tamil Nadu Couple
తమిళనాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్‌గా చేసుకుని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అను, అరుల్ ప్రాణేశ్ అనే వధూవరులు మొదట తమ పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. 
 
పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తీసిపెట్టారు. ఈ నెల 14న వారి పెళ్లి జరిగింది. లాక్ డౌన్ కారణంగా వివాహానికి రూ.13 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి. ఇంకా రూ.37లక్షలు మిగిలింది. ఆ డబ్బుని వారు పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు.
 
కొవిడ్ భయం కారణంగా చాలామంది ఆహ్వానితులు రాలేదని, చివరికి ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా తామిచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారని వరుడు అరుల్ ప్రాణేశ్ చెప్పాడు. ఈ పరిస్థితుల్లోనూ పెళ్లిని వాయిదా వేయకూడదని పెద్దలు నిర్ణయించారని, దీంతో తాము వట్టమాలై అంగలమ్మన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. స్థానిక అధికారుల అనుమతితో కొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినట్లు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments