Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో జయలలితదే అధికారం.. స్థానిక మీడియా సర్వేల్లో వెల్లడి

Webdunia
బుధవారం, 18 మే 2016 (13:32 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో అన్నాడీఎంకే అధికారం కోల్పోయి, డీఎంకే పవర్‌లోకి వస్తుందని వెల్లడించాయి. ఇవి అన్నాడీఎంకే శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయగా, డీఎంకే శ్రేణులు ఆనందోత్సంలో ముంచెత్తాయి. 
 
నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌లో అధికశాతం అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా, డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అన్నాడీఎంకే అధికారానికి దూరమవుతుందని 4 ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించగా, కాదు కాదు మళ్లీ ఆ పార్టీనే అధికారంలో వుంటుందని ఒకే ఒక సంస్థ వెల్లడించిన ఎగ్జిట్‌పోల్‌ స్పష్టం చేసింది. 
 
అయితే, తమిళ మీడియా మాత్రం అన్నాడీఎంకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ ఫలితాలపై జూనియర్ వికటన్, తంతి టీవీ, దినమలర్, న్యూస్ 7, పుదియ తలైమురై, మక్కల్ ఆయువు కళగం, కుముదమ్ రిపోర్టర్ వంటి సంస్థలు నిర్వహించిన సర్వేలో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి.
 
ఇటు జాతీయ, అటు స్థానిక మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో సగటున లెక్కిస్తే జయలలితకు 107 సీట్లు, డీఎంకే కూటమికి 99 చొప్పున వస్తాయినీ, చిన్నాచితక పార్టీలు అత్యంత కీలకంగా మారుతాయని పేర్కొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments