Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో జయలలితదే అధికారం.. స్థానిక మీడియా సర్వేల్లో వెల్లడి

Webdunia
బుధవారం, 18 మే 2016 (13:32 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో అన్నాడీఎంకే అధికారం కోల్పోయి, డీఎంకే పవర్‌లోకి వస్తుందని వెల్లడించాయి. ఇవి అన్నాడీఎంకే శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయగా, డీఎంకే శ్రేణులు ఆనందోత్సంలో ముంచెత్తాయి. 
 
నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌లో అధికశాతం అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా, డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అన్నాడీఎంకే అధికారానికి దూరమవుతుందని 4 ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించగా, కాదు కాదు మళ్లీ ఆ పార్టీనే అధికారంలో వుంటుందని ఒకే ఒక సంస్థ వెల్లడించిన ఎగ్జిట్‌పోల్‌ స్పష్టం చేసింది. 
 
అయితే, తమిళ మీడియా మాత్రం అన్నాడీఎంకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ ఫలితాలపై జూనియర్ వికటన్, తంతి టీవీ, దినమలర్, న్యూస్ 7, పుదియ తలైమురై, మక్కల్ ఆయువు కళగం, కుముదమ్ రిపోర్టర్ వంటి సంస్థలు నిర్వహించిన సర్వేలో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి.
 
ఇటు జాతీయ, అటు స్థానిక మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో సగటున లెక్కిస్తే జయలలితకు 107 సీట్లు, డీఎంకే కూటమికి 99 చొప్పున వస్తాయినీ, చిన్నాచితక పార్టీలు అత్యంత కీలకంగా మారుతాయని పేర్కొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments