Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి బాలుడిని వాషింగ్ మెషీన్‌లో దాచేసిన మహిళ.. చివరికి?

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (12:18 IST)
తమిళనాడులోని తిరునెల్వేలిలో ఘోరం జరిగింది. ఓ మహిళ అభం శుభం తెలియని పసికందును దారుణంగా హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని తన ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో దాచింది. బాలుడు కనిపించలేదని.. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఆతుకురిచ్చి గ్రామంలో తంగమ్మాళ్ (40) అనే మహిళ జీవనం సాగిస్తోంది. ఆమె బిడ్డ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే తన పక్కింటిలో ఉన్న విఘ్నేష్‌ అనే వ్యక్తి వల్ల తంగమ్మాళ్ బిడ్డను కోల్పోయింది. దీంతో విఘ్నేశ్‌పై పగను పెంచుకున్న తంగమ్మాళ్.. ఆయన బిడ్డను వాషింగ్ మెషీన్‌లో దాచేసింది. 
 
తమ బిడ్డ కనిపించకుండా పోవడంపై పొరుగింట్లో ఉంటున్న తంగమ్మాళ్‌ హస్తం ఉందన్న సందేహాలను కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తంగమ్మాళ్‌ ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో బాలుడు సంజయ్‌ మృతదేహాన్ని గుర్తించారు. 
 
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments