Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. సీఎం మమతా బెనర్జీ

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (09:39 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని అధికార టీఎంసీ అధినేతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నేతలు కొట్టిపారేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ సీట్లకు గాను టీఎంసీ 29 సీట్లు దక్కించుకోగా, బీజేపీకి 12 వచ్చాయి. అయితే, బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ సీఎం మమతా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. తృణమూల్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. 
 
బెంగాల్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు దశల్లో జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందంటూ ఎన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. టీఎంసీ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ 2019లో వచ్చిన 22 సీట్ల కంటే అదనంగా మరో ఆరు సీట్లను దక్కించుకుని మొత్తం 29 సీట్లను గెలుచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments