Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కూడా హైస్పీడ్ రైళ్లు.. గంటకు 220 కిమీ వేగం?!!

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (10:26 IST)
భారత్‌లో కూడా హైస్పీడ్ రైళ్ళను ప్రవేశపెట్టే దిశగా భారతీయ రైల్వే శాఖ కసరత్తులు చేపట్టింది. ఇప్పటికే వందే భారత్ పేరుతో గంటకు 150 నుంచి 160 కిమీ వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టగా, వీటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో వందే భారత్ రైళ్ళకు మరింత ధీటుగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఈ రైళ్ళు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ రైలు పట్టాలెక్కితే హైదరాబాద్ శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం నాలుగున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. 
 
అయితే, ఈ హైస్పీడ్ రైళ్లను నడపాలంటే ఇపుడున్న ట్రాక్‌‍లు ఏమాత్రం పనికిరావు. ఎంతో వేగంగా వెళఅలే ఈ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ నేపథ్యంలో పలు మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రైల్వే సాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ఏపీ, తెలంగాణాల్లో రెండు రూట్లు ఉన్నాయి. 
 
హైదరాబాద్ - విశాఖపట్ణం, కర్నూలు - విజయవాడ రూట్లలో ఈ హైస్పీడ్ కారిడార్‌ ఏర్పాటు చేయడానికి చేపట్టిన ప్రాథమిక సర్వే ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ప్రాథమిక ఇంజనీరింగ్, ట్రాఫిక్  సర్వే రిపోర్టు కూడా వస్తే ఆ తర్వాత డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తారు. 
 
అయితే, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు. హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేందుకు ఎలివేటెడ్ కారిడార్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో ఎక్కడెక్కడ బ్రిడ్జిలు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టాలి అనేది పరిశీలించారు. అయితే, హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కాలంటే మరో ఐదారేళ్లు వేచి ఉండక తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం