Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంబరు ప్లేట్లపై తెలంగాణ స్టేట్‌(టీఎస్) బదులు తెలంగాణ(టీజీ)గా మార్పు : నేడు నిర్ణయం

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:55 IST)
తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మంత్రిమండలి సమావేశంలో వాహనాల నంబరు పేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ (టీఎస్‌)గా ఉన్న పేరును తెలంగాణ (టీజీ)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం అమలు జరిగితే రాష్ట్రంలో ఇకముందు జరిగే వాహనాల రిజిస్ట్రేషన్‌ టీజీ పేరుతోనే జరగనుంది. 
 
అలాగే, ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న సత్ ప్రవర్తన గల ఖైదీల విడుదల అంశం కూడా చర్చకు రానుంది. ఇప్పటికే జైళ్ల శాఖ 240 మంది సత్ ప్రవర్తన గల ఖైదీల జాబితాను సిద్ధం చేసింది. వీరిని విడుదల చేయాలంటే ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి, జీవోను జారీ చేయాల్సి ఉంటుంది. కేబినెట్‌ భేటీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై కూడా మంత్రులు చర్చించనున్నారు. జూరాల నుంచి పర్దిపూర్‌కు, పర్దిపూర్‌ నుంచి సంగంబండ దాకా నీటిని తరలిస్తుండగా 20 టీఎంసీల నీటిని కొడంగల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు నీటిని అందించడానికి వీలుగా 'నారాయణపేట - కొడంగల్‌' ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గంలో చర్చించి, ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయని సమాచారం.
 
ఇప్పటికే ఈ పథకాన్ని చేపట్టాలని పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో సమావేశమై, నివేదించుకోగా... దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. గృహ విద్యుత్తు వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అమలు చేసే 'గృహలక్ష్మి' పథకం విధివిధానాలపై చర్చ జరుగనుంది. ఈ పథకానికి ఏ మేరకు ఖర్చు కానుంది? అమలు చేయడానికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలపై చర్చించనున్నారు. 
 
ఆదివారం సచివాలయంలోని ఆరో అంతస్తులో గల కేబినెట్‌ మీటింగ్‌ హాల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఓట్‌–ఆన్‌–అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చించి, ఆమోదించే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో పాటు గ్రూప్‌–1 పోస్టుల పెంపు/భర్తీ, గ్యారెంటీల అమలుపైనా చర్చ జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments