Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో చర్చలు ఫలిస్తాయన్న విశ్వాసం లేదు: రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (17:31 IST)
సరిహద్దు వివాదంపై చైనాతో జరుగుతున్న చర్చల ఫలితంపై మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పెదవి విరిచారు. చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని వుందని, అయితే చర్చలు ఫలిస్తాయన్న విశ్వాసం లేదన్నారు.

నెల రోజుల తర్వాత మళ్లీ లఢక్‌ వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనికులను కలిసి వారి నుద్దేశించి మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు సమస్యను పరిష్కరించడానికే జరిగాయని, అయితే దానిపై గ్యారంటీ ఏమీ లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. భారత్‌ భూబాగం నుండి ఒక్క అంగుళం భూమిని కూడా ఏ దేశమూ తీసుకు పోలేదని హామీ ఇచ్చారు.

పాంగాంగ్‌ సరస్సు దగ్గరలోని లుకుంగ్‌ పోస్ట్‌ను సదర్శించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ పై వ్యాఖ్యలు చేశారు. రాజ్‌నాథ్‌ రెండు రోజుల పర్యటన కోసం లఢక్‌, జమ్ము కాశ్మీర్‌ వెళ్లారు.

ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ప్రపంచంలో ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని, ఏ దేశంపైన భారత్‌ దండెత్తలేదని, ఏ దేశపు భూబాగాన్ని తమదిగా చెప్పుకోలేదని, వసుధైక కుటుంబం అనే భావనపై భారత్‌కు నమ్ముకముందని రాజ్‌నాథ్‌ అన్నారు.

అశాంతిని భారత్‌ కోరుకోదని, ఏ దేశపు గౌరవాన్ని కించపరచదని, అలాగని భారత దేశ గౌరవాన్ని కించపరిచేలా ఎవరైనా ప్రయత్నిస్తే గట్టి సమాధానం ఇస్తుందని మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments