Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది భారత్‌లో అంతర్భాగమే.. కానీ భారతీయ పురుషులకు నో ఎంట్రీ.. ఎందుకని?

అదో మినీ ఇజ్రాయేల్. కానీ, భారత్‌లో అంతర్భాగం. భారతదేశంలో ఉన్న సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో అదొకటి. ఈ ప్రాంత ప్రకృతి అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:59 IST)
అదో మినీ ఇజ్రాయేల్. కానీ, భారత్‌లో అంతర్భాగం. భారతదేశంలో ఉన్న సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో అదొకటి. ఈ ప్రాంత ప్రకృతి అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా ఇజ్రాయేల్‌ పర్యాటకులు అమితంగా ఇష్టపడుతారు. కానీ, ఈ ప్రాంతంలోని పర్యాటక అందాలను కనులారా వీక్షించేందుకు మాత్రం భారతీయ పురుషులకు మాత్రం అనుమతి లేదు. ఆ ప్రాంతం పేరు కసోల్. ఓ చిన్నపాటి గ్రామం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతం రమణీయమైన ప్రకృతి అందాలతో నిండివుంటుంది.
 
ఈ గ్రామంలో హిబ్రూ భాష మాట్లాడతారు. భారతీయ పురుషులను రానివ్వరు. ఒకవేళ ఎవరైనా మగాడు వెళ్ళినా స్థానికులు ఆశ్రయం ఇవ్వరు. పురుషులపై ఈ గ్రామం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి సౌందర్యం, పరిసరాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. తరతరాల నుంచి ఇజ్రాయిలీలు ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు.
 
భారతీయ పురుషుల రాకపై నిషేధం విధించడానికి కారణం లేకపోలేదు. ఈ గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చే విదేశీ మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తుండటమేనని స్థానికులు వివరించారు. అంటే కసోల్‌లో పుట్టిన మగాళ్ళే ఆ అందాలను ఆస్వాదించగలరన్నమాట! విదేశీ పర్యాటకులకు బస ఏర్పాటు చేయడానికి రోజుకు రూ.300 చొప్పున స్థానికులు వసూలు చేస్తారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments