Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బంద్... తిరుమలలో శ్రీవారి భక్తుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుపయమవుతున్న భక్తులు బస్సులు లేక బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా తిరగడం లేదు. షాపులన్నీంటినీ మూసివేశారు. బంద్‌ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
 
బంద్‌ ప్రభావం తిరుమలపై పడిందని స్పష్టంగా చెప్పవచ్చు. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సర్వదర్శనంతో పాటు కాలినడకన దర్శనానికి వెళ్లే భక్తులు కంపార్టుమెంటులోకి వెళ్లకుండా నేరుగా క్యూలైన్‌ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. గంటలోనే శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments