Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మండిన పెట్రోల్ ధర

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (12:26 IST)
పెట్రో ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. లీటరు పెట్రోల్‌ ధరను 26పైసలు, డీజిల్‌ ధరను 25 పైసలు పెంచాయి ప్రభుత్వ రంగంలోని చమురు విక్రయ కంపెనీలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.83.71 నుంచి రూ.83.97కు, డీజిల్‌ ధర రూ.73.87 నుంచి రూ.74.12కు చేరుకుంది.

ఇంతకు ముందు ఢిల్లీలో 2018 అక్టోబరు 4న అత్యధికంగా పెట్రోల్‌ ధర రూ.84 స్థాయిని చేరుకుంది. డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో రూ.75.45గా నమోదైంది. ప్రస్తుతం పెట్రోల్‌ ధర ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరువలో ఉంది.
 
ఇక ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.90.60 ఉండగా.. డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ.80.78ని తాకింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.87.34 ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.88 పలికింది. కాగా ప్రస్తుతం ఇంధనాలపై పన్ను తగ్గించే అంశం పరిశీలనలో లేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.
 
ఇంతకు ముందు పెట్రో ధరలు గరిష్ఠ స్థాయిని తాకిన ప్పుడు ప్రభుత్వం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.1.50 తగ్గించింది. చమురు కంపెనీలు లీటరుపై మరో రూ.1 తగ్గించాయి. దీని వల్ల వాహనదారులపై భారం కాస్త తగ్గే అవకాశం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments