Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తాం : ఎమ్మెల్యే అనంత

పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తాం : ఎమ్మెల్యే అనంత
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:08 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని పాతూరు చెన్నకేశవస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమానికి  ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ..అనంతపురం జిల్లా కేంద్రంలో అనేక ఆలయాలకు వంద సంవత్సరాలపై కూడా చరిత్రలు ఉన్నాయని అటువంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

నేడు అన్ని కులమతాలకు ఎంతో పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సారథ్యం ఇళ్లపట్టాల పంపిణి చేసే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, జమ్మూ సందర్భంగా మరోమారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మరోసారి ప్రజలను మోసగిస్తున్నాడు: అచ్చెన్నాయుడు