Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘాటెక్కిన ఉల్లి ధర

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:24 IST)
దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది.

సెప్టెంబరు నుంచి జనవరి వరకు కర్నూలు జిల్లాతోపాటు, కర్ణాటక నుంచి ఉల్లి వస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది.
 
దిగుమతులపై నిబంధనల సడలింపు
ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులపై నిబంధనలను సడలించింది. దేశీయంగా సరఫరాను పెంచి పెరుగుతున్న రిటైల్‌ ధరలను అదుపు చేయడానికి ఉల్లిపాయలను ముందుగా రవాణా చేయడానికి వీలుగా ప్రభుత్వం డిసెంబర్‌ 15 వరకు దిగుమతి నిబంధనలను సడలించింది.

ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశానికి భారీగా ఉల్లి దిగుమతి అయ్యేలా వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సంబంధిత దేశాల్లోని భారత హై కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు నేరుగా భారతీయ ఓడరేవులకు చేరతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments