Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘాటెక్కిన ఉల్లి ధర

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:24 IST)
దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది.

సెప్టెంబరు నుంచి జనవరి వరకు కర్నూలు జిల్లాతోపాటు, కర్ణాటక నుంచి ఉల్లి వస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది.
 
దిగుమతులపై నిబంధనల సడలింపు
ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులపై నిబంధనలను సడలించింది. దేశీయంగా సరఫరాను పెంచి పెరుగుతున్న రిటైల్‌ ధరలను అదుపు చేయడానికి ఉల్లిపాయలను ముందుగా రవాణా చేయడానికి వీలుగా ప్రభుత్వం డిసెంబర్‌ 15 వరకు దిగుమతి నిబంధనలను సడలించింది.

ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశానికి భారీగా ఉల్లి దిగుమతి అయ్యేలా వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సంబంధిత దేశాల్లోని భారత హై కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు నేరుగా భారతీయ ఓడరేవులకు చేరతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments