Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదల్లో నిండు గర్భిణిని ఆసుపత్రికి... నేవీ ఆసుపత్రిలో మగబిడ్డ

కేరళ వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ, నౌకాదళాలు కూడా తమ వంతుగా సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఈరోజు 25 ఏళ్ల స

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (19:20 IST)
కేరళ వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ, నౌకాదళాలు కూడా తమ వంతుగా సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఈరోజు 25 ఏళ్ల సజీత జబీల్ నిండు గర్భిణిని వైద్యులు పరీక్షించి, వైద్య సహాయం అందించడానికి నేవీ సహాయం కోరారు. 
 
వెంటనే ఆమెను తన స్వగ్రామమైన ఆలువా నుండి హాస్పిటల్‌కి చేర్చారు. నేవీ అధికారి CDR విజయ వర్మ ఆ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆమె సురక్షితంగా హాస్పిటల్‌కు చేరడమే కాకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
నేవీ అధికారులు తీసిన ఒక వీడియోని మరియు చంటి బిడ్డ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడంతో నెటిజన్లు నేవీకి, అలాగే సహాయక చర్యలలో పాల్గొంటున్న వారందరినీ అభినందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న కేరళ మళ్లీ యథాస్థితికి చేరుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments