Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కనిష్ఠానికి క్రియాశీల కరోనా కేసులు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (20:08 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 10,68,514 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మందురోజు కంటే కేసులు 14 శాతం మేర పెరిగాయి. నిన్న 311 మంది మరణించారు. ఒక్క కేరళలో 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరగా.. 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక నిన్న 14,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం 1,51,209 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసులు 252 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ఆ రేటు 0.44 శాతం తగ్గగా.. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది.

గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల, రికవరీ రేట్లు సానుకూలంగా నమోదవుతున్నాయి. మరోపక్క నిన్న 41,16,230 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 107 కోట్ల మార్కును దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments