Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ప్రయాణికులకు తాజా మార్గదర్శకాలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:19 IST)
కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ పేరుతో విమానాలను నడుపుతోంది. 
 
ఈ వందే భారత్ మిషన్ ద్వారానే విదేశాల్లో ఉన్న వారిని సొంత ప్రదేశాలకు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 24వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా 11,82,129 మంది ప్రయాణీకులను రప్పించింది. 
 
ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్ & ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో ప్రయాణం చేసే వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.  
 
* ప్రయాణానికి ఏ వర్గానికి చెందిన వారు అర్హులు అనేదాన్నికేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.
* విదేశీ ప్రయాణాలకు అర్హులైన వర్గానికి చెందిన వారి జాబితా పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచుతారు.
* అలాంటి వ్యక్తులు అవసరమైన పత్రాలు పౌరవిమానయాన శాఖకు లేదా సంబంధిత అధీకృత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకుంటారు
* ప్రయాణం పౌరవిమానయాన శాఖ అనుమతించిన నాన్ షెడ్యూల్డ్ విమానాల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
* విదేశీ ప్రయాణానికి వెళ్లే నౌకలపై పనిచేయాలనుకునే భారత నావికులు, సిబ్బంది తమ యాజమాన్యాలు ఏర్పాటు చేసిన విమానాలు లేదా పౌర విమానయాన శాఖ నడిపే నాన్ షెడ్యూల్డ్ విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది
* ప్రయాణ ఖర్చులను ప్రయాణికులే భరించాలి.
* ప్రయాణికులందరూ థర్మల్ స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
* విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బంది, అందరు ప్రయాణికులు మాస్కులు ధరించడంతోపాటు చేతులను పరిశుభ్రంగా ఉంచడం లాంటి నిబంధనలు పాటించడం తప్పనిసరి. 
* అన్ని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్స్ ప్రయాణికుల వివరాలు ఆయా విమానయాన సంస్థలు సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఒక కాపీతో సహా సంబంధిత భారత రాయబార కార్యాలయాలకు పంపాలి.
* విదేశాల నుంచి వస్తున్న అన్ని విమానాలు/ నౌకల వివరాలు కనీసం రెండు రోజుల ముందుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్లైన్ లో ప్రచురించాల్సి ఉంటుంది.
* ప్రయాణికులందరూ తమ ప్రయాణానికి తామే బాధ్యులమని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
* విమానాలు, నౌకల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులు అందరూ మాస్కులు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
* దేశ సరిహద్దుల ద్వారా ప్రవేశించే ప్రయాణికులు కూడా ఇదే తరహా నిబంధనలు పాటించాలి.
* ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన అన్ని నిబంధనలు, క్వారంటైన్ మార్గదర్శకాలు పాటించాలి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments