Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ప్రయాణికులకు తాజా మార్గదర్శకాలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:19 IST)
కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ పేరుతో విమానాలను నడుపుతోంది. 
 
ఈ వందే భారత్ మిషన్ ద్వారానే విదేశాల్లో ఉన్న వారిని సొంత ప్రదేశాలకు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 24వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా 11,82,129 మంది ప్రయాణీకులను రప్పించింది. 
 
ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్ & ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో ప్రయాణం చేసే వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.  
 
* ప్రయాణానికి ఏ వర్గానికి చెందిన వారు అర్హులు అనేదాన్నికేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.
* విదేశీ ప్రయాణాలకు అర్హులైన వర్గానికి చెందిన వారి జాబితా పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచుతారు.
* అలాంటి వ్యక్తులు అవసరమైన పత్రాలు పౌరవిమానయాన శాఖకు లేదా సంబంధిత అధీకృత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకుంటారు
* ప్రయాణం పౌరవిమానయాన శాఖ అనుమతించిన నాన్ షెడ్యూల్డ్ విమానాల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
* విదేశీ ప్రయాణానికి వెళ్లే నౌకలపై పనిచేయాలనుకునే భారత నావికులు, సిబ్బంది తమ యాజమాన్యాలు ఏర్పాటు చేసిన విమానాలు లేదా పౌర విమానయాన శాఖ నడిపే నాన్ షెడ్యూల్డ్ విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది
* ప్రయాణ ఖర్చులను ప్రయాణికులే భరించాలి.
* ప్రయాణికులందరూ థర్మల్ స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
* విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బంది, అందరు ప్రయాణికులు మాస్కులు ధరించడంతోపాటు చేతులను పరిశుభ్రంగా ఉంచడం లాంటి నిబంధనలు పాటించడం తప్పనిసరి. 
* అన్ని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్స్ ప్రయాణికుల వివరాలు ఆయా విమానయాన సంస్థలు సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఒక కాపీతో సహా సంబంధిత భారత రాయబార కార్యాలయాలకు పంపాలి.
* విదేశాల నుంచి వస్తున్న అన్ని విమానాలు/ నౌకల వివరాలు కనీసం రెండు రోజుల ముందుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్లైన్ లో ప్రచురించాల్సి ఉంటుంది.
* ప్రయాణికులందరూ తమ ప్రయాణానికి తామే బాధ్యులమని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
* విమానాలు, నౌకల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులు అందరూ మాస్కులు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
* దేశ సరిహద్దుల ద్వారా ప్రవేశించే ప్రయాణికులు కూడా ఇదే తరహా నిబంధనలు పాటించాలి.
* ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన అన్ని నిబంధనలు, క్వారంటైన్ మార్గదర్శకాలు పాటించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments