Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా కుమారుడి కంపెనీ వృద్ధిరేటు 16 వేల రెట్లు

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పుత్రుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగిందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించ

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (07:31 IST)
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పుత్రుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగిందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది. దీంతో ఆ వెబ్‌పోర్టల్‍‌పై జయ్ పరువు నష్టం దావా వేశారు. 
 
దీనిపై అహ్మదాబాద్‌లోని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ జడ్జి ఎస్‌కే గాఢ్వీ కోర్టు విచారణకు ఆదేశించారు. జయ్‌ షా తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) తుషార్‌ మెహతా వాదనలు వినిపించనున్నారు. ఇందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అనుమతించారు. తగిన అనుమతులు తీసుకుని... ఏఎస్‌జీ ప్రైవేటు వ్యక్తుల తరపున వకాల్తా పుచ్చుకోవచ్చునని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.
 
మరోవైపు.. ఈ కథనాన్ని ఆసరాగా చేసుకుని విపక్ష పార్టీలు మోడీ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. "జయ్‌షాకు చెందిన టెంపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కంపెనీకి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే లాభాలు ఎలా వచ్చాయో చెప్పాలి! కంపెనీ టర్నోవర్‌ రూ.50 వేల నుంచి యేడాదిలో రూ.80 కోట్లకు ఎలా పెరిగిందో బదులివ్వాలి" అని డిమాండ్‌ చేశాయి. 
 
"మోడీజీ... మీరేం చేస్తున్నారు? వాచ్‌మన్‌లా ఉన్నారా!? లేక... మీకూ ఇందులో వాటా ఉందా! ఏదో ఒకటి చెప్పండి!' అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో నిలదీశారు. 'పెద్దనోట్ల రద్దువల్ల లబ్ధి జరిగింది ఒక్కరికే! ఆ ఒక్కరు... ఆర్బీఐ, రైతులు, ప్రజలు కాదు! 'షా-షా' మాత్రమే. జై అమిత్‌" అని వ్యాఖ్యానించారు. 
 
'2013, 2014లో జయ్‌ షా కంపెనీ రూ.6230, రూ.1724 నష్టాన్ని నమోదు చేసింది. 2014-15 నుంచి లాభాలు రావడం మొదలైంది. రూ.50 వేలు ఉన్న టర్నోవర్‌ 2015-16లో రూ.80 కోట్లకు చేరింది. బీజేపీ అధికారంలోకి రాగానే మార్పు మొదలైంది. రాజకీయ ఆశ్రిత పక్షపాతానికి ఇది నిదర్శనం కాదా! దీనిపై విచారణ జరపాల్సిందే' అని కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఇప్పటికే డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments