Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా బాలిక, నలుగురు యువకులు గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (21:02 IST)
వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 14 ఏళ్ల కూతురిని నిలదీసిన తల్లి.. ఆమె చెప్పిన వార్త విని షాకైంది. వెంటనే కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు బయల్దేరింది. తన కూతురిపై కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న నలుగురు యువకులపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. హర్యానాలోని ఛక్రిదాద్రి జిల్లాలోని జోజు కలన్ గ్రామంలో జరిగింది. 
 
జోజు కలన్ గ్రామానికి చెందిన మహిళ కూలి పనుల కోసం రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆమె 14 ఏళ్ల కూతురు మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఇది గమనించిన అదే ఊరికి చెందిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. తర్వాతి రోజు తన స్నేహితుడితో కలిసి మళ్లీ ఆ బాలిక దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు యువకులు కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
ఇలా బెదిరిస్తూ ఆమెపై నలుగురూ పలుమార్లు అత్యాచారం చేశారు. గత సోమవారం ఆ బాలికకు కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తాయి. తల్లి నిలదీయడంతో ఆ బాలిక అప్పటివరకు జరిగిన విషయం మొత్తాన్నీ చెప్పేసింది. దీంతో తల్లి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ నలుగురు యువకులపై కేసు నమోదు చేసింది. బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు పోస్కో చట్టం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం