Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా బాలిక, నలుగురు యువకులు గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (21:02 IST)
వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 14 ఏళ్ల కూతురిని నిలదీసిన తల్లి.. ఆమె చెప్పిన వార్త విని షాకైంది. వెంటనే కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు బయల్దేరింది. తన కూతురిపై కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న నలుగురు యువకులపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. హర్యానాలోని ఛక్రిదాద్రి జిల్లాలోని జోజు కలన్ గ్రామంలో జరిగింది. 
 
జోజు కలన్ గ్రామానికి చెందిన మహిళ కూలి పనుల కోసం రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆమె 14 ఏళ్ల కూతురు మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఇది గమనించిన అదే ఊరికి చెందిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. తర్వాతి రోజు తన స్నేహితుడితో కలిసి మళ్లీ ఆ బాలిక దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు యువకులు కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
ఇలా బెదిరిస్తూ ఆమెపై నలుగురూ పలుమార్లు అత్యాచారం చేశారు. గత సోమవారం ఆ బాలికకు కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తాయి. తల్లి నిలదీయడంతో ఆ బాలిక అప్పటివరకు జరిగిన విషయం మొత్తాన్నీ చెప్పేసింది. దీంతో తల్లి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ నలుగురు యువకులపై కేసు నమోదు చేసింది. బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు పోస్కో చట్టం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం