Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప ఆలయానికి రోజూ 25 వేల మందికి ప్రవేశం

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (22:48 IST)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం అధ్యక్షతన నేడు  జరిగిన సమీక్ష  సమావేశంలో శబరిమలలో మండల మకరవిలక్కు ప్రారంభమైన నాటినుండి ప్రతిరోజూ 25 వెలమందిని  అనుమతించాలని నిర్ణయించారు.  ఒకవేళ ఈ సంఖ్యను పెంచే విషయం  ఉంటే,  తరువాత చర్చించి నిర్ణయించడం జరుగుతుందని సమావేశం తీర్మానించింది. 

ఇంకా కోవిడ్ నిబంధనలు మేరకు  అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. "వర్చువల్ క్యూ" సిస్టమ్ కొనసాగుతుంది. 10 సంవత్సరాల లోపు మరియు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులు కూడా ప్రవేశానికి అనుమతించబడతారు. 

అయితే శబరిమల వచ్చే అయ్యప్పలు రెండు మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్ లేదా ఆర్టిపిసిఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ వచ్చిన వారికి ప్రవేశం అనుమతించ  బడుతుంది. అభిషేకం చేసిన నెయ్యిని అందరికి అందేలా  దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేయాలని సిఎం  పినరయి విజయన్ ఈ సమావేశంలో చెప్పారు.

అయ్యప్పలను దర్శనం అనంతరం  సన్నిధానంలో ఉండడానికి అనుమతించరు.  ఈ విషయంలో గత సంవత్సరం 
పరిస్తితి కొనసాగుతుంది. యాత్రీకులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలోగానీ,  పుల్మేడు మీదుగా సన్నిధానానికి గాని  సాంప్రదాయ మార్గంలో అనుమతించరు. పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.

యాత్రీకులు వచ్చే వారి వారి వాహనాలు నీలక్కల్ లో పార్క్ చేయడానికి మాత్రమే అనుమతించబడతాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ బస్ లను  మాత్రం   పంపా వరకు అనుమతిస్తారు. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments