Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముస్లిం యువకులు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అలా కాపాడారు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (08:47 IST)
చుట్టూ విధ్వంసం.. పోలీసు కాల్పులు.. వేదనలు, రోదనలు.. మరోవర్గం తమపైకి వస్తుందేమోనన్న ఆందోళన. అంతటి విపత్కర పరిస్థితిలోనూ కొంతమంది ముస్లిం యువకులు మత సామరస్యాన్ని కాపాడేందుకు నడుం బిగించారు.

తమ ప్రాణాలొడ్డి ఆంజనేయ స్వామి ఆలయంపై విధ్వంసకారుల చేయిపడకుండా అడ్డుకున్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
 
బెంగళూర్‌లో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బంధువు షేర్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టు విధ్వంసం సృష్టించింది. ఆ పోస్టు అవమానకరంగా ఉందంటూ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపైకి దాడికి వచ్చారు. ఆ చట్టుపక్కల ఉన్న ఆస్తులపై ధ్వంసానికి తెగబడ్డారు. దాదాపు 200 బైకులను తగులబెట్టారు.

వీరిని ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘర్షణలో కొందరు ముస్లీమ్‌లు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అల్లరి మూక ప్రయత్నించగా ముస్లీమ్‌ యువకులంతా కలిసి చేయి చేయి పట్టుకొని గుడిచుట్టూ మానవహారం చేపట్టారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూముస్లీమ్‌లు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని సందేశాన్నిచ్చారని నెటిజన్లు వారిని కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments