Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రాణాలతో రాగలిగాను.. మీ సీఎంకు థ్యాంక్స్ : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (20:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా నిలిచిపోయింది. భద్రతా వైఫల్యంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లకుండానే వెనక్కి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఇది కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. నిరసనకారులు ఆయన ప్రయాణిస్తున్న రోడ్డు మార్గాన్ని నిర్బంధించడంతో మోడీ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతిపెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ ఆ ఫ్లైఓవర్ నుంచి భతిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంర్భంగా ఆయన ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడుతూ, "భతిండా ఎయిర్‌పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్" అని అన్నారు. మరోవైపు, ఈ ఘటన వల్ల ఫిరోజ్‌పూర్‌లో ఆయన చేపట్టాల్సిన ర్యాలీ రద్దు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments