Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో శ్రీలంక తరహా పేలుళ్లకు లష్కరే-తోయిబా కుట్ర.. భద్రత కట్టుదిట్టం..

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (16:35 IST)
శ్రీలంకలో ఏప్రిల్‌లో తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈస్టర్ పండుగ రోజున మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 359 మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. ఈ ఘటనను ఇంకా జనం మరిచిపోలేని పరిస్థితుల్లో వుండగా.. నిఘా సంస్థలు మరో హెచ్చరికను జారీ చేశాయి. 
 
శ్రీలంక పేలుళ్లకు సంబంధించి 106 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద జరిపిన విచారణలో అయోధ్యను లక్ష్యంగా దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేందుకు ఆదివారం వెళ్లనున్నారు. 
 
అలాగే యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ కూడా రామాలయంలో ఆదివారం పూజలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా రామ జన్మభూమి అధ్యక్షుడు మహానంద్ 81వ జయంతి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్యలో ఉగ్రవాదులు దాడికి కుట్రపన్నినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 
 
అయోధ్యలో బస్సులు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలును లక్ష్యంగా లష్కరే తోయిబా సంస్థ దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments