Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఘా నీడలో తిరుమల తిరుపతి.. తస్మాత్ జాగ్రత్త..!

Advertiesment
నిఘా నీడలో తిరుమల తిరుపతి.. తస్మాత్ జాగ్రత్త..!
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:38 IST)
దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.


దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించగా, తిరుమలతో పాటు ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు.
 
ప్రయాణికులు, యాత్రికులు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు చెప్తున్నారు. యాత్రికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు, పోలీస్‌ వాట్సప్‌ నెంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బాంబు, డాగ్‌ స్క్వాడ్లు రైల్వేస్టేషన్లు, బంస్టాండ్లు, అతిథి గృహాలు, దేవాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. 
 
రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుమల ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లగేజీని పరిశీలించి అనుమానాలు తీరిన తర్వాతే ఎవరినైనా వదిలిపెడుతున్నారు. శ్రీలంకలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు భారత్‌ను టార్గెట్ చేసినట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారం అందించిన సంగతి విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియా ఎన్నికలు... పిట్టల్లా రాలుతున్న ఎన్నికల సిబ్బంది. ఎందుకు?