Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు : టీడీపీ

'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ చేస్తున్నా! విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి! సమగ్ర వివరణ ఇవ్వండి! లేదంటే... మీరు ఏపీ పట్ల దురుద్దేశంతో ఉ

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (09:09 IST)
'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ చేస్తున్నా! విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి! సమగ్ర వివరణ ఇవ్వండి! లేదంటే... మీరు ఏపీ పట్ల దురుద్దేశంతో ఉన్నారని భావించక తప్పదు. మేం ఇంకా మీతో బంధం ఎందుకు కొనసాగించాలనే విషయంపై పునరాలోచించక తప్పదు' అంటూ లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిలదీశారు. 
 
సుమారు 14 నిమిషాలపాటు ఆంగ్లంలో అనర్ఘళంగా చేసిన ప్రసంగంలో ప్రధాని, ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు' అంటూ తేల్చి చెప్పారు. 
 
'రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించిన కాంగ్రెస్‌కు ఏపీ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారు. మరి... ఆ చట్టంలోని అంశాలను కనీసం అమలు చేయని బీజేపీ సంగతి ఏమిటో ఆలోచించండి. వీటన్నింటిపై మీ వివరణ డిమాండ్‌ చేస్తున్నాం. లేనిపక్షంలో... మీరు మా రాష్ట్రం పట్ల 'దురుద్దేశం' (బ్యాడ్‌ ఫెయిత్‌)తో ఉన్నారని భావించి... ఈ బంధం ఎందుకు కొనసాగించాలి? అనే అంశంపై ఆలోచించక తప్పని పరిస్థితి వస్తుందని సభా ముఖంగా బీజేపీ అగ్రనేతలకు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments