Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. బాలికను వేధించి.. శానిటైజర్ తాగించారు..

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (08:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ బాలికను నానా రకాలుగా వేధించారు. ఆ తర్వాత శానిటైజర్ తాగించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ భయానక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలీకి చెందిన 16 యేళ్ళ విద్యార్థిని గత నెల 27వ తేదీన స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అనే పోకిరి వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అతడికి తోడయ్యారు. నలుగురూ కలిసి బాలికను వేధించడం మొదలుపెట్టారు. 
 
అదేసమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించాడు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ బాలిక శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments