Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. బాలికను వేధించి.. శానిటైజర్ తాగించారు..

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (08:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ బాలికను నానా రకాలుగా వేధించారు. ఆ తర్వాత శానిటైజర్ తాగించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ భయానక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలీకి చెందిన 16 యేళ్ళ విద్యార్థిని గత నెల 27వ తేదీన స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అనే పోకిరి వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అతడికి తోడయ్యారు. నలుగురూ కలిసి బాలికను వేధించడం మొదలుపెట్టారు. 
 
అదేసమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించాడు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ బాలిక శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments