Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని వేధించాడనీ టీచర్‌ను కాల్చిచంపిన బీటెక్ స్టూడెంట్

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:50 IST)
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియురాలిని ఓ టీచర్ వేధించడాన్ని ఆ యువతి ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తుపాకీ తీసుకుని టీచర్‌ను కాల్చి చంపాడు. ఈ హత్యకు పాల్పడింది కూడా బీటెక్ విద్యార్థి కావడం గమనార్హం. ఈ దారుణం న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పత్ పట్టణానికి చెందిన కశ్యప్ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కశ్యప్ తన చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కశ్యప్ ప్రేమిస్తున్న యువతి కోచింగ్ సెంటరులో చదువుకుంటోంది. అక్కడ కుమార్ అనే టీచర్ ఆ యువతిని వేధిస్తున్నట్టు తెలుసుకున్నాడు. 
 
తనతో మాట్లాడకుంటే, ప్రేమించకుంటే తాను నరాలు కోసుకుంటానని ఆ యువతిని కుమార్ హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు కశ్యప్‌కు చెప్పింది. అంతే కోపంతో రగిలిపోయిన కశ్యప్ రూ.2 వేలకు కంట్రీమేడ్ రివాల్వరు కొని పొల్యూషన్ మాస్క్, తలకు టోపి ధరించి కోచింగ్ సెంటరుకెళ్లి కుమార్‌ను కాల్చి చంపి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో పారిపోతున్న కశ్యప్ కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగి కశ్యప్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments