Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని వేధించాడనీ టీచర్‌ను కాల్చిచంపిన బీటెక్ స్టూడెంట్

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:50 IST)
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియురాలిని ఓ టీచర్ వేధించడాన్ని ఆ యువతి ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తుపాకీ తీసుకుని టీచర్‌ను కాల్చి చంపాడు. ఈ హత్యకు పాల్పడింది కూడా బీటెక్ విద్యార్థి కావడం గమనార్హం. ఈ దారుణం న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పత్ పట్టణానికి చెందిన కశ్యప్ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కశ్యప్ తన చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కశ్యప్ ప్రేమిస్తున్న యువతి కోచింగ్ సెంటరులో చదువుకుంటోంది. అక్కడ కుమార్ అనే టీచర్ ఆ యువతిని వేధిస్తున్నట్టు తెలుసుకున్నాడు. 
 
తనతో మాట్లాడకుంటే, ప్రేమించకుంటే తాను నరాలు కోసుకుంటానని ఆ యువతిని కుమార్ హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు కశ్యప్‌కు చెప్పింది. అంతే కోపంతో రగిలిపోయిన కశ్యప్ రూ.2 వేలకు కంట్రీమేడ్ రివాల్వరు కొని పొల్యూషన్ మాస్క్, తలకు టోపి ధరించి కోచింగ్ సెంటరుకెళ్లి కుమార్‌ను కాల్చి చంపి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో పారిపోతున్న కశ్యప్ కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగి కశ్యప్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments