Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని వేధించాడనీ టీచర్‌ను కాల్చిచంపిన బీటెక్ స్టూడెంట్

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:50 IST)
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియురాలిని ఓ టీచర్ వేధించడాన్ని ఆ యువతి ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తుపాకీ తీసుకుని టీచర్‌ను కాల్చి చంపాడు. ఈ హత్యకు పాల్పడింది కూడా బీటెక్ విద్యార్థి కావడం గమనార్హం. ఈ దారుణం న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పత్ పట్టణానికి చెందిన కశ్యప్ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కశ్యప్ తన చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కశ్యప్ ప్రేమిస్తున్న యువతి కోచింగ్ సెంటరులో చదువుకుంటోంది. అక్కడ కుమార్ అనే టీచర్ ఆ యువతిని వేధిస్తున్నట్టు తెలుసుకున్నాడు. 
 
తనతో మాట్లాడకుంటే, ప్రేమించకుంటే తాను నరాలు కోసుకుంటానని ఆ యువతిని కుమార్ హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు కశ్యప్‌కు చెప్పింది. అంతే కోపంతో రగిలిపోయిన కశ్యప్ రూ.2 వేలకు కంట్రీమేడ్ రివాల్వరు కొని పొల్యూషన్ మాస్క్, తలకు టోపి ధరించి కోచింగ్ సెంటరుకెళ్లి కుమార్‌ను కాల్చి చంపి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో పారిపోతున్న కశ్యప్ కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగి కశ్యప్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments