Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి ... కేసులు పోవాలంటే బీజేపీలో చేరాలి!

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:00 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే ఈ నలుగురు నేతలు బీజేపీలో చేరారు. 
 
వీరి చేరికపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి.. కేసులో పోవాలంటే బీజేపీలో చేరాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా, సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేయలేదనీ, బ్యాంకులే సుజనా చౌదరిని మోసం చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. పైగా, వారిని రక్షించేందుకే ప్రధానమంత్ర నరేంద్ర మోడీ వారిని పార్టీలో చేర్చుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీలు, నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెల్సిందే. పైగా, డొల్ల కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలను సుజనా చౌదరి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి బయటపడేందుకే సుజనా చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారని అనేక మంది రాజకీయ నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments