Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరగానే సచ్ఛీలురయ్యారా : మాయావతి ఎద్దేవా

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (12:50 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. టీడీపీలో ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు అవినీతిపరులుగా కనిపించారనీ ఇపుడు బీజేపీలో చేరగానే వారంతా సచ్చీలురై పోయారంటూ ఎద్దేవా చేశారు. 
 
పైగా, బీజేపీ బ్రాండ్‌ రాజకీయాల్లో అన్నీ సరైనవేనని ఆమె అన్నారు. నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసుకోవడంపై శుక్రవారం ట్విట్టర్ స్పందిస్తూ, 'ప్రభుత్వం తరపున రాష్ట్రపతి గురువారమే హామీలిచ్చారు. కానీ అదేరోజు బీజేపీ నలుగురు టీడీపీ ఎంపీల ఫిరాయింపును రచించింది. ఆ నలుగురిలో ఇద్దరిని అవినీతిపరులుగా గతంలో అభివర్ణించింది. ఇప్పుడు ఆ పార్టీలో చేరగానే వారు పాల కంటే స్వచ్ఛంగా మారిపోయారు' అంటూ ఎద్దేవా చేశారు. 
 
కాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు గురువారం బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. పైగా, రాజ్యసభలో టీడీపీపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ కూడా ఇచ్చారు. ఈ విలీనంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments