Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ మూర్ఖుడు.. చెప్తే అర్థం చేసుకునే రకం కాదు.. జేసీ సెన్సేషనల్ కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ చెప్తే అర్థం చేసుకునే రకం కాదని ఏకిపారేశారు. మోదీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడని జేసీ తీవ

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (18:19 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ చెప్తే అర్థం చేసుకునే రకం కాదని ఏకిపారేశారు. మోదీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడని జేసీ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ వద్ద ఉన్న మంత్రులు కూడా అటువంటి వారేనని జేసీ ధ్వజమెత్తారు. 
 
రైల్వే, ఆర్థిక మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని జేసీ తెలిపారు. మోదీ ప్రభుత్వం నుంచి ఏపీ ఏమీ సాధించలేదని జేసీ స్పష్టం చేశారు. ఇకపై కేంద్రం నుంచి ఏపీ ఏదో సాధిస్తుందనుకునే పప్పులో కాలేసినట్లేనని జేసీ అన్నారు. ఎంపీగా తానైతే సంతృప్తిగా లేనని జేసీ పేర్కొన్నారు. ఓ ఎంపీగా తాను నిర్వర్తించాల్సిన విధుల పట్ల తనకు ఏమాత్రం సంతృప్తి లేదన్నారు. 
 
ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని జేసీ అన్నారు. ఎంతసేపటికీ నిరసనలతో సమయం సరిపోతుందని, ప్రతి పార్టీ నిరసనలకే పరిమితమవుతోందని జేసీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గుతుందేమో కానీ, అదే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో టీడీపీకి 25 లోక్‌సభ స్థానాలు వస్తాయని జేసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments